సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎపి ప్రభుత్వం
ఎపిలో కార్యాలయాల తరలింపుపై ఈ నెల 4న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయంగా ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరింది. హైకోర్టు ఎక్స్పార్టీగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ఎపి ప్రభుత్వం పేర్కొంది. ప్రాథమిక కారణాలు తెలియ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ పిటిషన్ను సోమవారం విచారించే అవకాశం ఉంది.