దేశానికి వెన్నుముక రైతన్న.. రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు

  • డా. రవికుమార్ మిడతాన ఆధ్వర్యంలో రైతుల చేతుల మీదుగా రైతు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

విజయనగరం: జనసేన పార్టీ సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన ఆధ్వర్యంలో డిసెంబర్ 23వ తేదీన జరుగనున్న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలో పలు గ్రామాల్లో నేరుగా రైతులను కలిసి, రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన సహాయ సహకారాలు చేస్తున్నారో, రైతులకు వివరించడం జరిగింది, అలాగే రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే, పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేశారని తెలియజేయడం జరిగింది. అలాగే డిసెంబర్ 23వ తారీఖున జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుని సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా రైతుల చేతుల మీదుగా జాతీయ రైతు దినోత్సవం పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పిట్ట బాలు, రాంబాబు చౌడువాడ, చిన్ని కృష్ణ, పొట్నూరు చంటి, కిలా బాలాజీ, గుద్దుల ఈశ్వరరావు, సుంకరి కోటి, కోరాడ గణేష్, కే దాసు, పడాల శివకుమార్, పైడ్రాజు, అప్పన్న దొర, నాగిరెడ్డి కాళీ, సత్తిబాబు రుద్ర, పసుమర్తి సాయి, నాగు బిల్లి శంకర్రావు, దాట్ల గంగరాజు, గారి గౌర్నాయుడు, పిట్ట రఘు, వారబోయిన గంగరాజు జన సైనికులు పాల్గొన్నారు.