శేఖర్ వారియర్స్ టీం జెర్సీ లాంచ్ చేసిన తిరుపతి అనూష

విజయవాడ వెస్ట్: జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుష మంగళవారం శేఖర్ వారియర్స్ టీం జెర్సీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. ఈ టీం సభ్యుడైన శేఖర్ చనిపోతే అతని జ్ఞాపకార్థంగా అతను గుర్తుండేలా ఈ “టీం” సభ్యులందరు కలిసి శేఖర్ అనే పేరు “టీం” కి పెట్టుకోవడం అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా ఈ టీం మరెన్నో విజయాలు సాధించాలని అనూష ఆశాభావం వ్యక్తం చేస్తూ వీరందరికీ అభినందనలు తెలియచేసారు. అదేవిధంగా ఈ జెర్సీ స్పాన్సర్ చేసిన పద్మజా ఇంజనీరింగ్ వర్క్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి లాగానే మరి ఎంతోమంది ముందుకు వచ్చి యువతని చెడు వ్యసనాల నుంచి దూరం చేస్తూ క్రీడారంగం వైపు ఆలోచించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, గోపి తదితరులు పాల్గొన్నారు.