రోడ్ల దుస్థితిపై తిరుపతి జనసేన వినూత్న నిరసన

*3 వ రోజు #GoodMorningCMSir

*తిరుపతిలో మూడవరోజు #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా జనసేన వినూత్న నిరసన..

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు. మూడవ రోజు తిరుపతి నగరంలో అన్నమయ్య సర్కిల్ వద్ద ప్రజలు రోడ్లు మీద వాహనాలు నడపలేక ఒక్కొక్క రోజు ఒక్కో పార్ట్ ఊడిపోతున్న పరిస్థితులలో, నెలకి నాలుగు సార్లు రిపేరు చేయించుకోవడం చాలా కష్టం అని మోటార్ సైకిళ్ళు పాత సామాన్లకు అమ్మడం జరుగుతుంది అనే విన్నూత్నరీతిలో జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి, మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, సుభాషిని, వనజ, మధుబాబు, కీర్తన, సత్యవంతుడు, పార్థు, హేమ కుమార్, రాజేష్, మనోజ్, కిషోర్ తదితరులతో కలిసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని అద్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని నిరసన తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో: జనసేన పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.