ఒకే మాటపై పని చేస్తాం- జనసేన నాయకులు

డా. బీ ఆర్. అంబెడ్కర్ కోనసీమ జిల్లా: ఎన్నికల పొత్తులో భాగంగా అమలాపురం అసెంబ్లీ టికెట్ తెలుగుదేశానికి కేటాయించడంతో తాము ఒకే మాటగా పని చేస్తామని జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఇటీవల జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీ జిల్లా కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలవడంతో నియోజకవర్గ జనసేనలో నిరుత్సాహం ఏర్పడిందన్నారు. గత నాలుగు రోజులుగా పార్టీలో ఉన్న రెండు వర్గాలను సమన్వయ పరచడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చామన్నారు. ఎవరు ఎన్ని వర్గాలుగా ఉన్నా అందరూ పని చేసేది పార్టీ కోసమే అని అన్నారు. ఏ.వేమవరంలో బుధవారం ఆత్మీయ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. రానున్న కాలంలో అమలాపురంలో జనసేన పార్టీని ఎలా నడిపించాలి, పొత్తులో భాగంగా మిత్ర పార్టీలైన తెలుగుదేశం, బిజెపిలతో సమన్వయంతో నడవాలి అన్న విషయంపై చర్చించారు. అమలాపురం పరిస్థితులను పార్టీ అధిష్టానానికి తెలిపి, తదుపరి ఉమ్మడి అభ్యర్థి బలోపేతంపైనా, కార్యాచరణపై మరోసారి సమావేశమై ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సలాది వెంకట రమణ, నల్లా శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, ఇసుక పట్ల రఘు బాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పడాల శ్రీదేవి, పడాల నానాజీ, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, ఆకుల సూర్యనారాయణ మూర్తి, నల్లా అజయ్, మొయిల శివ, పోలిశెట్టి బాబులు, అడపా ప్రకాష్, హనుమాన్ బుజ్జి, బట్టు పండు, చేట్ల మంగతాయారు, తిక్కా సరస్వతి, కర్రి లక్ష్మి దుర్గ, షరీఫ్, కరీం, షఫీ ఉల్లా, మున్వర్, బాషా తదితరులు పాల్గొన్నారు.