జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయండి: కొల్లు నరేష్ నాయుడు

తెలంగాణ, ఉప్పల్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొల్లు నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం, మీర్పేట్, హెచ్.బి కాలనీ, కృష్ణానగర్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొల్లు నరేష్ నాయుడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో జనసేన పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి మానవత్వం గల మహోన్నతమైన దేశభక్తి గల నాయకుడు పెట్టిన జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, కె.నరేష్, ఎన్.రాంబాబు, రామ్మోహన్, సాంబశివరావు, బి.శ్రావణ్, కె.రాము, కృష్ణారావు, రామ్మూర్తి , కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.