మర్రిపాడు కమిటి సభ్యుల వివరాలను ప్రకటించిన మండలాధ్యక్షురాలు ఒరుగంటి ప్రమీల

నెల్లూరు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సూచనలతో మర్రిపాడు మండలాధ్యక్షురాలు శ్రీమతి ఒరుగంటి ప్రమీల కమిటీ సభ్యుల వివరాలను జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షుల నియామక కమిటీ సభ్యులు శ్రీమతి కోలా విజయలక్ష్మి మరియు ప్రధాన కార్యదర్శి కిషోర్ గనుకులకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీమతి పసుపులేటి సుకన్య, ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గంటా అంజి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, చిన్నా జనసేన పాల్గొన్నారు.